- మరణం తర్వాత ఒక వ్యక్తికి చేరుతూ ఉండే పుణ్యఫలం ఈ విధంగా ఉంటుందని ధర్మపండితులు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు:
- కొనసాగుతూ ఉండే దాతృత్వం, ప్రయోజనకరమైన జ్ఞానం, దుఆ (ప్రార్థన) మరియు ఇతర హదీథ్లలో: హజ్ గురించి కూడా ప్రస్తావించబడింది.
- ఈ మూడు ఈ హదీసులో ప్రత్యేకంగా ప్రస్తావించబడినవి, ఎందుకంటే అవి మంచితనానికి పునాదులు, మరియు ధర్మవంతులైన వ్యక్తులు, వారి తర్వాత వీటిలో ఎక్కువ భాగం కొనసాగాలని భావిస్తారు.
- ప్రయోజనకరమైన ప్రతి జ్ఞానం అతనికి ప్రతిఫలాన్ని తెస్తుంది, కానీ వాటిలో అగ్రస్థానంలో మరియు శిఖరాగ్రంలో ఇస్లామీయ జ్ఞానం మరియు దానికి మద్దతు ఇచ్చే శాస్త్రాలు ఉన్నాయి.
- జ్ఞానం ఈ మూడింటిలో అత్యంత ప్రయోజనకరమైనది, ఎందుకంటే దానిని నేర్చుకునే వ్యక్తికి జ్ఞానం ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞానము అంటే అందులో “షరియాను” భద్రపరచడం కూడా ఉంది, ఇది సాధారణంగా ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఙ్ఞానము మరింత సమగ్రమైనది మరియు సాధారణమైనది ఎందుకంటే ఇది మీ జీవితంలో ఉన్న ఙ్ఞానము నుండి నేర్చుకోబడుతుంది, మరియు అలా నేర్పిన ఙ్ఞానము మీ మరణం తరువాత కూడా ఉంటుంది.
- ఈ హదీథ్లో పిల్లలను నీతిమంతులైన పిల్లలుగా పెంచాలని ప్రోత్సాహం ఉంది; పరలోకంలో తమ తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూర్చేది వారే, మరియు ఆ ప్రయోజనాలలో ఒకటి తల్లిదండ్రుల కొరకు దుఆ చేయడం (ప్రార్థించడం).
- ఈ హదీథ్లో తల్లిదండ్రుల మరణానంతరం వారి పట్ల దయ చూపమని ప్రోత్సాహం ఉంది, ఇది కూడా ఒక రకమైన ధర్మపరాయణత్వం, దాని నుండి బిడ్డ ప్రయోజనం పొందుతాడు.
- దుఆ (ప్రార్థన) అనేది పిల్లల నుండి కాకపోయినా మరణించిన వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది, కానీ ఇందులో సంతానం ప్రత్యేకంగా ప్రస్తావించబడింది, ఎందుకంటే అతను సాధారణంగా మరణించే వరకు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు.