- వుదూ చేయునపుడు పాదాలను కడుగుకొనుట విధి. ఎందుకంటే (కొందరు భావిస్తున్నట్లుగా) వుదూలో పాదాలను కడుగవలసిన అవసరం లేదు, తడి చేతులతో పాదాలను తాకితే సరిపోతుంది అనడమే నిజమైతే, పాదాలను సరిగా కడుగక నిర్లక్ష్యం చేసిన వానిని నరకాగ్ని శిక్షతో హెచ్చరించవలసిన అవసరం ఉండేది కాదు.
- నీటితో కడగ వలసిన అన్ని భాగాలను కడగడం తప్పనిసరి, మరియు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా లేదా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా శుద్ధి చేయవలసిన శరీర భాగాలలో దేనిలోనైనా కొంత భాగాన్ని వదిలివేస్తే, అతని నమాజు సరికాదు.
- ఈ హదీసులో విషయ పరిఙ్ఞానం లేని వారికి బోధించడం మరియు వారికి మార్గదర్శకం చేయడం యొక్క ప్రాధాన్యత తెలియుచున్నది.
- ధర్మపండితుడు (ఆలిమ్), ఎవరైనా వ్యక్తిని విధిగా చేయవలసిన ఆరాధనలను మరియు సున్నత్ ఆరాధనలను విస్మరించినట్లు చూస్తే, తగిన రీతిలో అతడిని సరిదిద్దాలి.
- ముహమ్మద్ ఇస్’హాఖ్ అల్ దహ్లవీ ఇలా అన్నారు: ‘అల్ ఇస్బాఘ్’ (ఉదూ చేయుటలో విధుల పరిపూర్ణత సాధించుట) మూడు రకాలుగా ఉంటుంది: ఆ భాగాన్ని ఒక సారి కడుగుట విధి; మూడుసార్లు కడుగుట సున్నత్; అభిలషణీయం ఏమిటంటే – ఎక్కువలో ఎక్కువ మూడు పర్యాయాలకు లోబడి క్షుణ్ణంగా శుభ్రపరుచుకొనుట.