- ఈ హదీథు ద్వారా (ఈ యుగపు) చివరి దినాలలో ఈసా అలైహిస్సలాం ఆకాశం నుండి దిగి వస్తారని రుజువు అవుతున్నది. ఆయన దిగిరావడం అనేది ప్రళయ ఘడియను సూచించే చిహ్నాలలో ఒకటి.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ (ప్రళయ ఘడియ వరకు) స్థిరంగా ఉంటుంది. అది దేని చేతనూ రద్ధు చేయబడదు.
- ఇందులో – ప్రపంచపు చివరి దినాలలో సంపదలో శుభాలు, ఆశీర్వాదాలు అవతారిస్తూ ఉంటాయని, ప్రజలు సంపద పట్ల ఆసక్తిని కలిగి ఉండరని (దాని నుండి దూరంగా ఉంటారని) తెలుస్తున్నది.
- ఇందులో – ఈసా అలైహిస్సలాం ఇస్లాం షరియత్ ప్రకారంగానే పరిపాలిస్తారనే విషయం ద్వారా, మనకు ప్రపంచపు చివరి దినాల వరకూ ఇస్లాం అమరంగా, స్థిరంగా ఉంటుందననే శుభవార్త కనిపిస్తున్నది.