- ఇది దాసులపై విధిగా చేయబడిన అల్లాహ్ యొక్క హక్కుకు సంబంధించి ఒక తిరుగు లేని ప్రకటన. అది ఏమిటంటే, దాసులు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ లేక దేనినీ ఆయనకు సాటి కల్పించరాదు.
- ఇందులో అల్లాహ్ పై దాసుల యొక్క హక్కుకు సంబంధించిన వివరణ ఉన్నది. అటువంటి వారిపై ఒక అనుగ్రహంలా, ఒక వరంలా, దాసుల యొక్క హక్కును అల్లాహ్ తనపై విధిగా చేసుకున్నాడు – అటువంటి వారిని అల్లాహ్ స్వర్గములో ప్రవేశింప జేస్తాడు మరియు వారిని శిక్షించడు.
- ఇందులో కేవలం మహోన్నతుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, ఆయనకు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని ఏకదైవారాధకులకు వారి అంతిమ గమ్యస్థానము స్వర్గమనే శుభ వార్త ఉన్నది.
- తనకు తెలిసిన ఙ్ఞానాన్ని (ఇతరులకు చేరవేయకుండా) దాచుకున్న పాపములో ఎక్కడ పడిపోతానో అనే భయంతో, ము’ఆద్ రజియల్లాహు అన్హు ఈ హదీసును తన మరణానికి ముందు ఉల్లేఖించారు.
- ఇందులో, వారు సరిగా అర్థం చేసుకోలేరేమో అనే సందేహం ఉంటే, కొన్ని హదీసులను కొద్ది మందికి తెలియ జేయక పోవడమే మంచిది అనే హెచ్చరిక ఉన్నది. ఎందుకంటే అందులో కేవలం ఈ ఆచరణ మాత్రమే చేయలనే పరిమితి లేదు. అలాగే సత్కార్యములకు షరియత్’లో ఒక హద్దు అనేది లేదు.
- కేవలం మహోన్నతుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, ఎవరినీ లేక దేనినీ ఆయనకు సాటి కల్పించని ఏకదైవారాధకులు ఒకవేళ అవిధేయతకు, పాపపు పనులకు పాల్బడితే, వారి భవిత అల్లాహ్ యొక్క తీర్పుకు లోబడి ఉంటుంది. ఆయన తలుచుకుంటే వారిని శిక్షిస్తాడు, ఆయన తలుచుకుంటే వారిని క్షమిస్తాడు. చివరికి వారిని స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడు.