- చనిపోయిన వారిని శాపనార్థాలు పెట్టుట 'హరాం' (నిషేధం) అని చెప్పడానికి ఈ హదీసు ఒక సాక్ష్యం.
- బ్రతికి ఉన్నవారి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, చనిపోయిన వారి పట్ల అవమానకరంగా మాట్లాడడాన్ని వదిలి వేయడం, గొడవలు, వైషమ్యాలు పెరుగకుండా చేస్తుంది. తద్వారా సమాజలో శాంతి, సౌభ్రాతృత్వాలు భంగపడకుండా ఉంటాయి.
- చనిపోయిన వారిపట్ల అవమానకరంగా మాట్లాడడాన్ని నిషేధించడం వెనుక వివేకం ఏమిటంటే, చనిపోయిన వారు తమ ఆచరణల ఫలాన్ని పొందడానికి వెళ్ళిపోయినారు. కనుక వారిని తిట్టడం, అవమానకరంగా మాట్లాడడం ఒక వృధా విషయం. అది వారిని ఏ విధంగానూ చేరదు, ఏ విధంగానూ ప్రభావితం చేయదు. పైగా బ్రతికున్న బంధువులను బాధ పెడుతుంది.
- ఇందులో, ఎవరైన సరే ప్రయోజనం ఏమీ కలిగించని మాటలను మాట్లాడరాదు అనే హితబోధ ఉన్నది.